కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- May 26, 2026
కువైట్ః 2026 మినిస్టీరియల్ రిజల్యూషన్ నం. 2కి అనుగుణంగా..ఇతర రంగాలకు పరిమితం చేయబడిన సెక్టార్ల కింద రిక్రూట్ చేయబడిన కార్మికులను బదిలీ చేయడానికి 11,654 అభ్యర్థనలను పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ ఆమోదించింది. దేశంలో ఇప్పటికే నివసిస్తున్న కార్మికులను ఉపయోగించుకోవడం ద్వారా కార్మిక మార్కెట్ను పునర్వ్యవస్థీకరించడానికి మరియు వివిధ ఆర్థిక రంగాల మానవ వనరుల అవసరాలను తీర్చడానికి ప్రయత్నాలలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
మొత్తం జారీ చేసిన అమోదాల్లో 60శాతానికి సమానమైన 7,016 బదిలీలతో చిన్న ప్రాజెక్టుల రంగం అత్యధిక వాటాను కలిగి ఉందన్నారు. ఇక 2,160 మంది కార్మికులను వ్యవసాయ రంగానికి, 1,293 మంది కార్మికులను పారిశ్రామిక సంస్థలకు, 1,057 మంది గ్రాసింగ్ సెక్టార్కు బదిలీలకు కూడా అధికార యంత్రాంగం ఆమోదం తెలిపింది. ఫిషింగ్ సెక్టార్ అత్యల్పంగా 128 కేసులతో అనుమతులు నమోదయ్యాయి. అధికారులు నిర్దేశించిన నియంత్రణలు మరియు షరతులకు అనుగుణంగా యజమానుల కార్మిక అవసరాలు మరియు లేబర్ మార్కెట్ నిబంధనల మధ్య సమతుల్యతను కొనసాగిస్తూ ఆర్థిక కార్యకలాపాలు, స్థానిక ప్రాజెక్టుల కొనసాగింపుకు మద్దతు ఇవ్వడం ఈ నిర్ణయం లక్ష్యమని అథారిటీ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







