ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- May 27, 2026
కువైట్: ఈద్ అల్-అధా సందర్భంగా కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి, కువైట్ అమీర్, యువరాజు, ప్రభుత్వం మరియు అక్కడి స్నేహపూర్వక ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేశారు.
ఈద్ అల్-అధా విశ్వాసం, త్యాగం, కరుణ మరియు ఉదారతకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇది మానవత్వం, ఐక్యత, ఉదారత మరియు పరస్పర గౌరవం వంటి బంధాలను బలోపేతం చేయడానికి మనకు స్ఫూర్తినిస్తుందన్నారు.
ఈ పండుగను భారతదేశంలో ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆత్మీయతతో జరుపుకుంటారని తెలియజేశారు. కుటుంబాలు ప్రత్యేక ప్రార్థనల కోసం ఒకచోట చేరి, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పండుగ భోజనాలను పంచుకుంటూ, అభాగ్యులకు దానధర్మాలు చేస్తూ సామరస్యం, ఐక్యత మరియు సాంస్కృతిక వైవిధ్యం వంటి గొప్ప సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని తెలిపారు.
కువైట్లోని 10 లక్షలకు పైగా ఉన్న భారతీయ సమాజానికి సోదరభావంతో కూడిన మద్దతును అందించినందుకు కువైట్ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కువైట్ మరియు భారత ప్రజల మధ్య ఉన్న సంబంధాలు సహజీవనం మరియు సహకారానికి ఒక విశిష్ట నమూనాగా నిలుస్తున్నాయని అన్నారు. రెండు మిత్ర దేశాలు మరియు ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి కృషి కొనసాగించాలని ఆశిస్తున్నట్టు తన ప్రకటనలో భారత రాయబారి పరామిత త్రిపాఠి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







