జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- July 15, 2026
అమ్మాన్: జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ బాలిస్టిక్ క్షిపణులను దేశ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్ సాయుధ దళాల జనరల్ కమాండ్ వెల్లడించింది.
జోర్డాన్ న్యూస్ ఏజెన్సీ పెట్రా (Petra) తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం తెల్లవారుజామున ఇరాన్ భూభాగం నుంచి ప్రయోగించిన మూడు బాలిస్టిక్ క్షిపణులు జోర్డాన్ గగనతలంలోకి ప్రవేశించగా, అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ వెంటనే స్పందించి వాటిని గగనతలంలోనే కూల్చివేసింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదని జోర్డాన్ సైన్యం స్పష్టం చేసింది. క్షిపణుల శకలాలు దేశంలోని పలు ప్రాంతాల్లో పడగా, రాయల్ ఇంజినీరింగ్ కార్ప్స్ బృందాలు సాంకేతిక, భద్రతా నిబంధనలను పాటిస్తూ వాటిని తొలగించే చర్యలు చేపట్టాయి. ఘటనాస్థలాలను పూర్తిగా భద్రపరిచి ప్రజల రక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
జోర్డాన్ సాయుధ దళాల ప్రతినిధి మాట్లాడుతూ, దేశ గగనతలాన్ని ఉల్లంఘించే ఏ చర్యనైనా లేదా దేశ భద్రతకు ముప్పు కలిగించే ఎలాంటి ప్రయత్నాన్నైనా సహించబోమని హెచ్చరించారు. జోర్డాన్ సార్వభౌమాధికారాన్ని, జాతీయ భద్రతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను ఎలాంటి సంకోచం లేకుండా చేపడతామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







