సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- May 28, 2026
హైదరాబాద్: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ప్రజల భద్రతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన “మీ సురక్ష” అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. నేరేడ్మెట్ పోలీసుల ఆధ్వర్యంలో సాయినాథపురంలోని ప్రశాంత్ గార్డెన్లో నిర్వహించిన ఈ సమావేశానికి పలు కాలనీలు, అపార్ట్మెంట్ల నుంచి మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. సుమతి, ఐపీఎస్ మాట్లాడుతూ “మీ సురక్ష” యాప్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను వేగంగా సంప్రదించే విధానాన్ని వివరించారు.
అలాగే రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోన్ కాల్స్, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా మోసాల నుంచి ఎలా జాగ్రత్తపడాలో ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమాన్ని నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్, ఏసీపీ యాదగిరి రెడ్డి, సైబర్ క్రైమ్ అధికారులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను అధికారులు వివరించగా, హాజరైన ప్రజలు ఆసక్తిగా విన్నారు. ప్రజల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పలువురు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- మహానాడు తొలిరోజు విజయవంతమైందన్న సీఎం చంద్రబాబు
- బక్రీద్ సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు
- సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ సుమతి
- మెడికవర్ హైటెక్ సిటీలో అత్యాధునిక ER-SSU యూనిట్ ప్రారంభం
- రాజస్థాన్లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!
- కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్: సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా!
- కువైట్పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!









