బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- July 14, 2026
మనామా: బహ్రెయిన్లో అత్యవసర హెచ్చరిక సైరన్లు మోగడంతో దేశవ్యాప్తంగా అప్రమత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయాన్ని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) అధికారికంగా ప్రకటించింది.
సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ (X) ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, దేశంలోని పౌరులు, నివాసితులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఒక్కరూ తమకు సమీపంలో ఉన్న సురక్షిత ప్రాంతాలకు వెంటనే వెళ్లాలని కోరింది.
అలాగే పరిస్థితులకు సంబంధించిన తాజా సమాచారం కోసం అధికారిక ప్రభుత్వ సమాచార మార్గాలను మాత్రమే అనుసరించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వదంతులను నమ్మవద్దని, అధికారిక ప్రకటనల ఆధారంగానే స్పందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం సైరన్లు మోగడానికి గల కారణాలపై అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. పరిస్థితిని సంబంధిత శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, అవసరమైన సూచనలు అధికారికంగా అందజేస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







