కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- July 14, 2026
హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలోని బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కరవు ఛాయలు అలముకుంటున్నప్పటికీ, గోదావరి నీటిని సముద్రం పాలు చేస్తూ రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నారని ఆయన మండిపడ్డారు.
కేసీఆర్ మార్క్ను చెరిపేసేందుకే.. ఎన్డీఎస్ఏ నివేదిక వంకతో డ్రామాలు!
గోదావరిలో తగినంత నీటి ప్రవాహం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సరిహద్దు అవతలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని విజయవంతంగా లిఫ్ట్ చేసుకుంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. “మరమ్మతులు పూర్తయినప్పటికీ, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికను సాకుగా చూపిస్తున్నారు. కేసీఆర్ కట్టించిన ఈ అద్భుత ప్రాజెక్టుకు చెడ్డపేరు తేవడమే కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి అజెండా” అని కేటీఆర్ విమర్శించారు.
‘కన్నెపల్లి’ నుంచి నీళ్లు ఎత్తిపోయకుంటే ఉద్యమం తప్పదు!
ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే నీటిని లిఫ్ట్ చేసి బీడువారిన భూములకు మళ్లించాలన్నారు. ఒకవేళ ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే, బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం







