ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభం!
- May 29, 2026
ఇరాన్లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభం అయ్యాయి. అయితే స్వల్ప స్థాయిలో ఇంటర్నెట్ యాక్సెస్లోకి వచ్చింది. గత కొన్ని నెలల నుంచి ఇరాన్లో ఇంటర్నెట్ అందుబాటులో లేదు. బుధవారమే ప్రభుత్వం మళ్లీ సేవల్ని ప్రారంభించింది. కానీ నెట్ చాలా స్లోగా వస్తోంది. ఇంటర్నెట్పై ఆంక్షలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వాధి నేతలకు వ్యతిరేకంగా జనవరిలో ఇరాన్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆ సమయంలో ఇంటర్నెట్పై ఆంక్షలు పెట్టారు. ఇక ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు దాడి ప్రారంభించిన తర్వాత ఇరాన్లో ఇంటర్నెట్ పూర్తిగా బ్లాకౌట్ అయ్యింది.
ఇంటర్నెట్ ట్రాకింగ్ కంపెనీ నెట్బ్లాక్స్ దీనిపై రిపోర్టును రిలీజ్ చేసింది. షట్డౌన్ కన్నా ముందు ఉన్ననాటి పరిస్థితులతో పోలిస్తే 86 శాతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు నెట్బ్లాక్స్ తెలిపింది. ఇక ఇంటర్నెట్ ట్రాఫిక్ సుమారు 40 శాతం ఉన్నట్లు కెంటిక్ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు ఉన్నాయని, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లపై ఆంక్షలు కొనసాగుతున్నట్లు తెలిపారు.
బ్లాక్ చేసిన సైట్లను వీక్షించేందుకు ఇరానీలు ఎక్కువగా వీపీఎన్పై ఆధారపడుతున్నట్లు తెలిసింది. ఇంటర్నెట్ నిషేధం వల్ల దేశంలో ఆన్లైన్ వ్యాపారం దెబ్బతిన్నది. నిరసనలు, యుద్ధం సమయంలో ఇరానీ కుటుంబాలు కమ్యూనికేట్ చేసుకునేందుకు ఇబ్బందిపడ్డాయి. అయితే అమెరికాతో శాంతి డీల్ కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటర్నెట్ను పాక్షికంగా పునరుద్దరించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!
- తొలి అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభించిన ముంబై నేవీ
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన మూడు ఇరానీ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- కువైట్ పై డ్రోన్ దాడి విఫలం.. గగనతలంలోనే కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- భారతీయులను వీసా లేకుండా థాయిలాండ్ కు వెళ్లొచ్చు







