కొత్త రూల్స్ తీసుకువచ్చిన BCCI
- May 29, 2026
ముంబై: ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. మరో రెండు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేడు (శుక్రవారం మే29) క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుండగా మే 31న ఆదివారం ఫైనల్ మ్యాచ్తో ఐపీఎల్ 2026 సీజన్ పూర్తి కానుంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది.
అత్యాధునిక కమ్యూనికేషన్ డివైజ్ల వినియోగం పెరుగుతుండడంతో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది మైదానంలో స్మార్ట్ గ్లాసెస్, సన్గ్లాసెస్ తరహా గ్యాడ్జెట్లను వాడొద్దని ఆదేశించింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. వీటి వల్ల లైవ్ స్ట్రీమింగ్తో పాటు మెసేజ్లు చేసుకునే వెలుసుబాటు ఉండటమే కారణం అని చెప్పింది.
ఇక మైదానంలోకి వెళ్లేముందు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది తమ స్మార్ట్ సన్గ్లాసెస్ కూడా డిపాజిట్ చేయాలని బోర్డు కోరింది. ఇలా చేయని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
‘మ్యాచ్ రోజులలో మైదానంలోకి ప్రవేశించేటప్పుడు, ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అందరూ తమ మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లతో పాటు అటువంటి పరికరాలను సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశిస్తున్నాం.’ అని బోర్డు తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- ఇక NIMSలో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!
- దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- థియేటర్లలో ఫైర్ ఫోర్స్ సేఫ్టీ తనిఖీలు..!!
- నిజాయితిని చాటిన భారత ప్రవాసుడు.. Dh100,000 అప్పగింత..!!
- ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!









