ఇరాన్లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి
- July 15, 2026
ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్లో ఏడుగురు ఇరాన్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఇరాన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున బంపూర్లోని సైనిక స్థావరంపై అమెరికా దాడులు చేసింది. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ టాస్నిమ్ తెలిపింది.
దాడుల్లో గరిష్ఠ ప్రాణనష్టం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరాన్ సైన్యం ఆరోపించింది. మొత్తం 13 క్షిపణులు దక్షిణ ఇరాన్లోని ఇరాన్షహర్ నగర సమీపంలోని సైనిక స్థావరంపై పడ్డాయని పేర్కొంది. ఈ దాడుల్లో గెస్ట్హౌస్, గార్డు పోస్టులు, సైనికుల నివాస సదుపాయాలు దెబ్బతిన్నట్లు తెలిపింది.
ఈ ఘటనలో పలువురు సైనికులు గాయపడినట్లు ఇరాన్ ఆర్మీ వెల్లడించింది. అమెరికా దాడికి “నిర్ణయాత్మక ప్రతిస్పందన” ఇస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







