ఇరాన్‌లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి

- July 15, 2026 , by Maagulf
ఇరాన్‌లో అమెరికా దాడులు.. ఏడుగురు సైనికులు మృతి

ఇరాన్‌ పై అమెరికా జరిపిన దాడుల్లో ఏడుగురు ఇరాన్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఇరాన్ ఆర్మీ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున బంపూర్‌లోని సైనిక స్థావరంపై అమెరికా దాడులు చేసింది. ఈ ఘటనలో ఏడుగురు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు సెమీ-అఫీషియల్ వార్తా సంస్థ టాస్నిమ్ తెలిపింది.

దాడుల్లో గరిష్ఠ ప్రాణనష్టం కలిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇరాన్ సైన్యం ఆరోపించింది. మొత్తం 13 క్షిపణులు దక్షిణ ఇరాన్‌లోని ఇరాన్‌షహర్ నగర సమీపంలోని సైనిక స్థావరంపై పడ్డాయని పేర్కొంది. ఈ దాడుల్లో గెస్ట్‌హౌస్, గార్డు పోస్టులు, సైనికుల నివాస సదుపాయాలు దెబ్బతిన్నట్లు తెలిపింది.

ఈ ఘటనలో పలువురు సైనికులు గాయపడినట్లు ఇరాన్ ఆర్మీ వెల్లడించింది. అమెరికా దాడికి “నిర్ణయాత్మక ప్రతిస్పందన” ఇస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com