దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- May 29, 2026
మనామా: క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి కువైట్ పై ఇరాన్ జరిపిన హేయమైన దాడిని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. కువైట్ దేశ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వాన్ని, అలాగే సత్సంబంధాల సూత్రాలను మరియు అంతర్జాతీయ చట్టాలను దారుణంగా ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఈ మేరకు కువైట్కు తమ పూర్తి సంఘీభావం తెలిపింది.
కువైట్ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇరాన్ దురాక్రమణను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న కువైట్ సాయుధ దళాల సంసిద్ధతను ఈ సందర్భంగా ప్రశంసించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఘనంగా ఎన్టీఆర్ 104వ జయంతి, టీడీపీ మహానాడు వేడుకలు
- భారత దేశవ్యాప్తంగా ఒకే హెల్ప్లైన్ నెంబర్..సుప్రీం ఆదేశం
- ఏపీలో రాబోయే మూడు రోజుల పాటు వర్ష సూచన
- సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- ఇక NIMSలో రూ.80 వేల జన్యు పరీక్షలు ఉచితం!
- దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- థియేటర్లలో ఫైర్ ఫోర్స్ సేఫ్టీ తనిఖీలు..!!
- నిజాయితిని చాటిన భారత ప్రవాసుడు.. Dh100,000 అప్పగింత..!!
- ఆసుపత్రులలో చేరిన, తప్పిపోయిన యాత్రికులను గుర్తించడానికి డ్రైవ్..!!









