కువైట్పై ఇరాన్ దాడులను ఖండించిన యూఏఈ, కువైట్ విదేశాంగ మంత్రులు
- May 29, 2026
అబుదాబి: యూఏఈ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేఖ్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కువైట్ విదేశాంగ మంత్రి షేఖ్ జర్రాహ్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సభాతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ తాజా పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ఫోన్ సంభాషణలో భాగంగా కువైట్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో జరిగిన ఇరాన్ ఉగ్రదాడులను ఇరువురు మంత్రులు తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా షేఖ్ అబ్దుల్లా బిన్ జాయెద్ మాట్లాడుతూ, సోదర దేశమైన కువైట్కు యూఏఈ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కువైట్ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు, అక్కడి ప్రజలు మరియు నివాసితుల రక్షణ కోసం తీసుకునే అన్ని చర్యలకు యూఏఈ మద్దతు ఇస్తుందని తెలిపారు.
కువైట్ భద్రత అనేది యూఏఈతో పాటు గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) దేశాల భద్రతలో అంతర్భాగమని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్
- ఇంగ్లాండ్ పై అర్జెంటీనా ఘన విజయం..
- గూగుల్ మ్యాప్స్లో కొత్త అప్డేట్..
- కువైట్లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ..అర్హతలు, పెట్టుబడి నిబంధనలు ఇవే
- సలాలాలో మొబైల్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్ ప్రారంభం..!!
- ఆర్థిక, పెట్టుబడి సహకారంపై బహ్రెయిన్–ఫ్రాన్స్ చర్చలు..!!
- సౌదీలో 2025 సుజుకి గ్రాండ్ విటారా కార్లు రీకాల్..!!







