సంక్షేమ పథకాల్లో డిజిటల్ కరెన్సీ..RBI కీలక యోచన
- May 29, 2026
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులను మరింత పటిష్టం చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు రిటైల్ రంగానికి కూడా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విస్తరించాలని ఆర్బీఐ యోచిస్తోంది. దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని విరివిగా పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్బీఐ తన తాజా వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఈ వ్యూహంలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టును మరింత విస్తృతం చేయనున్నారు.
గుజరాత్, పుదుచ్చేరిలలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్
2025-26 ఆర్థిక సంవత్సరాల్లో గుజరాత్, పుదుచ్చేరి, చండీగఢ్ వంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నగదు బదిలీ (DBT) పథకాల కింద డిజిటల్ కరెన్సీని ఆర్బీఐ ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ముఖ్యంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా రేషన్ లబ్ధిదారులకు అందించే ఆహార సబ్సిడీలను ఈ సీబీడీసీ ద్వారానే విజయవంతంగా అందజేశారు.
RBI: దుర్వినియోగానికి చెక్.. దారి మళ్లని నిధులు
ఈ డిజిటల్ కరెన్సీ విధానం వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా లబ్ధిదారుల డిజిటల్ వాలెట్లలో జమ చేసిన నిధులను కేవలం రేషన్ షాపులు, లేదా ప్రభుత్వం ఎంపిక చేసిన నిర్దేశిత వ్యాపారుల వద్ద వస్తువుల కొనుగోలుకు మాత్రమే ఉపయోగించేలా పరిమితులు విధించారు. రాబోయే రోజుల్లో మరికొంత మంది భాగస్వాములను ఇందులో చేర్చాలని ఆర్బీఐ నిర్ణయించింది.
తాజా వార్తలు
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సముద్ర గర్భంలో 500 ప్రాణాలు.. బంగాళాఖాతంలో ఘోర జలసమాధి..
- IRCTC సరికొత్త వెబ్సైట్ లాంచ్..
- మొగుడిని చంపి..కొడుకును పొడిచిన సైకో భార్య!
- పొరుగు దేశాలతో ఘర్షణ కోరుకోవడం లేదు..ఇరాన్ సైన్యం స్పష్టీకరణ
- జనం మధ్యకు జగన్నాథుడు
- భారత్ ఇకపై హార్ముజ్ జలసంధి పై ఆధారపడదు
- యూఏఈ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా..
- లంచం అడిగితే ఇవ్వం అని చెప్పండి: సీఎం విజయ్







