జూన్ 1 నుండి యూఏఈలో కఠినమైన వేతన రక్షణ చట్టం షురూ!
- May 30, 2026
యూఏఈలోని ప్రైవేట్ రంగ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడటానికి మరియు పారదర్శకతను పెంచడానికి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. జూన్ 1, 2026 (సోమవారం) నుండి అన్ని ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలను ప్రతి నెల మొదటి తారీఖు కల్లా (1st of every month) ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఉన్న 15 రోజుల గ్రేస్ పీరియడ్ (నెల మధ్యలో జీతాలు ఇచ్చే వెసులుబాటు) ఈ కొత్త చట్టంతో పూర్తిగా రద్దయింది.
కొత్త నిబంధనల ముఖ్యాంశాలు:
- మొదటి రోజే డెడ్ లైన్: ఉదాహరణకు, మే 2026 నెలకు సంబంధించిన జీతాన్ని జూన్ 1 కల్లా ఉద్యోగి ఖాతాలో వేయాలి. మొదటి తారీఖు దాటితే అది చట్టప్రకారం 'ఆలస్యమైన చెల్లింపు' (Delayed payment) గానే పరిగణించబడుతుంది.
- కఠినమైన నిఘా మరియు చర్యల టైమ్లైన్: డెడ్లైన్ తప్పిన కంపెనీలపై వేతన రక్షణ వ్యవస్థ (WPS) ద్వారా నిరంతరం నిఘా ఉంటుంది:
2వ రోజు: జీతం ఆలస్యమైతే ఆటోమేటిక్గా కంపెనీకి ఎలక్ట్రానిక్ హెచ్చరికలు, నోటిఫికేషన్లు వెళ్తాయి.
5వ రోజు: జీతాలు చెల్లించని సంస్థలకు కొత్త వర్క్ పర్మిట్ల (Work Permits) జారీని నిలిపివేస్తారు.
11వ రోజు: నిబంధనలను పదే పదే ఉల్లంఘించే కంపెనీలపై పరిపాలనాపరమైన జరిమానాలు (Fines) విధించడంతో పాటు వారిని 'థర్డ్ కేటగిరీ' కి డౌన్గ్రేడ్ చేస్తారు.
21వ రోజు: తీవ్రమైన ఆలస్యం జరిగితే పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేయడం, కంపెనీ ఓనర్లపై ట్రావెల్ బ్యాన్ (Travel Bans) విధించడం వంటి కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి.
- 85 శాతం కంప్లయన్స్ రూల్: కంపెనీ తన మొత్తం సిబ్బంది వేతనాలలో కనీసం 85 శాతాన్ని సకాలంలో చెల్లిస్తే ఆ సంస్థ నిబంధనలను పాటించినట్లుగానే పరిగణించబడుతుంది. చట్టబద్ధమైన మినహాయింపులు లేదా లోన్ డిడక్షన్ల వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ వెసులుబాటు కల్పించారు. అలాగే ఒక ఉద్యోగికి తన పూర్తి జీతంలో కనీసం 85% అందినా అతను వేతనం పొందినట్లే లెక్క.
మినహాయింపులు ఎవరికి ఉన్నాయి? కోర్టులో లేబర్ వివాదాలు ఉన్న ఉద్యోగులు, అబ్స్కాండింగ్ (Absconding) కేసులు ఉన్నవారు, అప్రూవ్డ్ అన్పెయిడ్ లీవ్ (Unpaid leave) లో ఉన్నవారు మరియు 3 నెలల లోపు మిషన్ వర్క్ పర్మిట్లపై ఉన్న తాత్కాలిక కార్మికులకు ఈ డెడ్లైన్ పరిమితుల నుండి మినహాయింపు ఉంటుంది. అలాగే కొన్ని విదేశీ సంస్థల బ్రాంచ్లు, బ్యాంకులు మరియు ధార్మిక సంస్థలకు కూడా మినహాయింపులు ఉన్నాయి.
ఈ కొత్త సంస్కరణల వల్ల అటు ఉద్యోగులకు ఆర్థిక భద్రత చేకూరడమే కాకుండా, ఇటు యాజమాన్యాలు తమ ఫైనాన్స్ మరియు పేరోల్ (Payroll) వ్యవస్థలను మరింత పకడ్బందీగా మార్చుకోవాల్సి ఉంటుంది.
--బాజీ షేక్(యూఏఈ)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







