ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- June 01, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ అంతటా వడగాలుల తీవ్రత పెరిగింది. అత్యధిక ఉష్ణోగ్రత 49 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటిన నేపథ్యంలో సివిల్ ఏవియేషన్ అథారిటీకి చెందిన వాతావరణ కేంద్రాల అధికారిక పర్యవేక్షణ నివేదిక ప్రకారం, బర్కా ప్రాంతంలో (Wilayat of Barka) గత 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 49.1°C ఉష్ణోగ్రత నమోదైంది. ఇది దేశవ్యాప్తంగా నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా నిలిచింది.
దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్ సువైక్ ప్రాంతంలో అత్యధికంగా 48.8°C ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో వాడి అల్ మావిల్ (48.0°C) నిలిచింది. అలాగే సహమ్ మరియు బిద్బిద్ ప్రాంతాలు రెండింటిలోనూ 47.9°C ఉష్ణోగ్రత నమోదైంది. తీరప్రాంతాలు మరియు అంతర్గత ప్రాంతాలలో కూడా తీవ్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. బావ్షర్లో 47.4°C, సూర్లో 47.3°C, అల్ అమెరాట్లో 47.2°C, అల్ రుస్తాక్లో 47.0°C, దిమా వా తాయీన్లో 46.9°C మరియు మస్కట్లో 46.7°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో హీట్ వేవ్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలని అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- DP World to expand logistics capacity in Dominican Republic with new US$100 million investment
- సౌదీ అరేబియా ప్రపంచ ప్రమాణాలను నెలకొల్పింది..WHO ప్రశంసలు..!!
- వేపింగ్ వల్ల ప్రాణాలకు ముప్పు.. టీనేజర్లకు డాక్టర్ల వార్న్..!!
- ఒమన్లో తీవ్రమైన వడగాలులు.. 49°C దాటిన ఉష్ణోగ్రతలు..!!
- పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి: కువైట్
- బహ్రెయిన్ లో హీట్ వేవ్స్.. ఆరోగ్య నిపుణుల హెచ్చరిక..!!
- అల్ ఖోర్ ఫ్యామిలీ పార్క్ లో ఫ్రీ ఫ్లైట్ పారట్ షో..!!
- సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రెటరీ గా బాధ్యతలు చేపట్టిన తేళ్ల కస్తూరి
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!









