ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- June 01, 2026
పంజాబ్లోని లుధియానాలో భారీ విషాదం చోటుచేసుకుంది. లుధియానా పరిధిలోని గాస్పురా ప్రాంతంలో ఉన్న ఒక టూల్ మాన్యుఫ్యాక్చరింగ్ (పరికరాల తయారీ) ఫ్యాక్టరీలో ఆదివారం రాత్రి ప్రమాదకర విషవాయువు లీక్ అయింది. ఈ గ్యాస్ పీల్చడం వల్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే స్పృహ కోల్పోయారు.
ఫ్యాక్టరీలో కార్మికులు స్పృహ తప్పి పడిపోవడాన్ని గమనించిన తోటి సిబ్బంది, యాజమాన్యం వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం ముగ్గురు కార్మికులు మరణించారు. మిగిలిన నలుగురు కార్మికులు ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
మృతుల్లో తండ్రీకొడుకులు.. కన్నీరుమున్నీరవుతున్న బంధువులు
ఈ ప్రమాదంలో మరణించిన వారిలో తండ్రీకొడుకులు కూడా ఉండటం స్థానికంగా తీవ్ర కలచివేస్తోంది. మృతులను గాస్పురా ప్రాంతానికే చెందిన మాన్ సింగ్, అలాగే అతని కుమారుడు అమిత్గా పోలీసులు గుర్తించారు. కాగా, ప్రాణాలు కోల్పోయిన మరొక కార్మికుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని, అతని గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి గ్యాస్ లీకేజీకి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- 5 రోజుల్లోనే జపాన్ ఈ-వీసా..
- ఫ్యాక్టరీలో విషవాయువు లీక్..ముగ్గురు కార్మికులు మృతి!
- కీసర పోలీస్ స్టేషన్ను సందర్శించిన మల్కాజ్గిరి సీపీ సుమతి
- ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్..
- ఇరాన్, అమెరికా శాంతి చర్చల్లో కుదరని స్పష్టత..
- గుజరాత్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం
- కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు డ్రోన్లు, క్షిపణి దాడులను తిప్పికొట్టాయి
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!









