టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ

- June 03, 2026 , by Maagulf
టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ

హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్‌లోని బ్రిటిష్ హైకమిషన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ అడ్వైజర్ నళిని రాఘురామన్ కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, రాజకీయ, ఆర్థిక సహకారం, పరస్పర ఆసక్తి కలిగిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

సమావేశంలో తెలంగాణ రక్షణ సేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు. ఇరు పక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో అభిప్రాయాలు పంచుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com