స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- June 04, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1పై బుధవారం జరిగిన మిస్సైల్ అటాక్ లో మరణించిన భారత జాతీయుడిని మధ్యప్రదేశ్కు చెందిన మన్సూర్ అహ్మద్ రెహమాన్ (55)గా గుర్తించారు. ఈ విషాదం జరిగినప్పుడు అతను భారతదేశానికి తిరిగి వస్తున్నాడు. రెహమాన్ కువైట్ నుండి బహ్రెయిన్ మీదుగా ముంబైకి వెళ్లే గల్ఫ్ ఎయిర్ విమానం ఎక్కడానికి విమానాశ్రయానికి చేరుకున్నాడు. అతను టెర్మినల్ 1లో చెక్-ఇన్ ప్రక్రియలు పూర్తి చేస్తుండగా, మిస్సైల్ శిథిలాలు తాకడంతో అతను మరణించాడు.
జూన్ 1 నుండి టెర్మినల్ 1 ద్వారా విదేశీ విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తాయని ప్రకటించిన తర్వాత, రహ్మాన్ మే 30న తన టిక్కెట్టును బుక్ చేసుకున్నాడు. దాడి జరిగినప్పుడు, అతను స్వదేశానికి తిరిగి వెళ్లడానికి వేచిఉన్న ప్రయాణికులలో ఒకడు. ఆ సమయంలో టెర్మినల్లో ఉన్న పలువురు గాయపడి, చికిత్స పొందుతున్నారు. కాగా, కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో రహ్మాన్ పార్థివ దేహాన్ని భారతదేశానికి తరలించే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!







