షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- June 04, 2026
యూఏఈ:షార్జాలో ఓ భారతీయ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. ఆయన హత్యకు సోషల్ మీడియా వీడియోకు సంబంధించిన వివాదమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని షార్జా పోలీసులు తెలిపారు. మృతి చెందిన భారతీయ వ్యక్తిని దుబాయ్లోని ఒక జ్యూస్ షాపులో పనిచేస్తున్న 40 ఏళ్ల ప్రవాసిగా గుర్తించారు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో తమ సంస్థ ఉందని 'YAB Legal' సీఈఓ సలాం పాపినస్సెరీ తెలిపారు. ఈ ఘటన మే 31న జరిగింది.
భారతీయ మీడియా కథనాల ప్రకారం..మృతుడు నిర్వహిస్తున్న ఒక 'TikTok Live' సెషన్ సమయంలో అనుమానితుడితో అతనికి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ వీడియోలో వారిద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం కనిపించింది. అంతేకాకుండా, షార్జాలో తనను నేరుగా కలవాలని అనుమానితుడు బాధితుడికి సవాలు విసిరాడు. వీరిద్దరి మధ్య ఆన్లైన్లో చాలా కాలంగా విభేదాలు ఉన్నట్లు భావిస్తున్నారు.
మృతుడు గత ఐదేళ్లుగా యూఏఈలో పనిచేస్తున్నాడని, గత ఏడాది సెలవుల నిమిత్తం కేరళలోని తన స్వగ్రామానికి వెళ్లి వచ్చాడని సలాం తెలిపారు. అతని సోదరుడు మరియు మరికొందరు బంధువులు కూడా ప్రస్తుతంయూఏఈలోనే ఉన్నారని పేర్కొన్నారు. మృతుడి మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు అవసరమైన పత్రాల ప్రక్రియను పూర్తి చేసే ప్రయత్నాల్లో ఉన్నామని తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!







