భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!

- June 04, 2026 , by Maagulf
భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి, కువైట్‌లోని సెంట్రల్ మార్చురీని సందర్శించారు. అలాగే, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో మరణించిన భారత జాతీయుడి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్‌మెంట్ జనరల్ మేనేజర్ బ్రిగేడియర్ అబ్దుల్‌రహీమ్ అల్-అవాధిని కలిసి చర్చించారు.  

ఈ దాడిలో గాయపడి, ప్రస్తుతం కువైట్‌లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న భారత జాతీయులను కూడా రాయబారి త్రిపాఠి పరామర్శించారు. ఆమె గాయపడిన వారితో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాయబార కార్యాలయం తరఫున సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.

మృతుని కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని త్వరితగతిన భారతదేశానికి తరలించేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com