భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- June 04, 2026
కువైట్: కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి, కువైట్లోని సెంట్రల్ మార్చురీని సందర్శించారు. అలాగే, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో మరణించిన భారత జాతీయుడి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ బ్రిగేడియర్ అబ్దుల్రహీమ్ అల్-అవాధిని కలిసి చర్చించారు.
ఈ దాడిలో గాయపడి, ప్రస్తుతం కువైట్లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న భారత జాతీయులను కూడా రాయబారి త్రిపాఠి పరామర్శించారు. ఆమె గాయపడిన వారితో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాయబార కార్యాలయం తరఫున సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.
మృతుని కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని త్వరితగతిన భారతదేశానికి తరలించేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







