భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- June 04, 2026
కువైట్: కువైట్లోని భారత రాయబారి పరామిత త్రిపాఠి, కువైట్లోని సెంట్రల్ మార్చురీని సందర్శించారు. అలాగే, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన దాడిలో మరణించిన భారత జాతీయుడి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్ బ్రిగేడియర్ అబ్దుల్రహీమ్ అల్-అవాధిని కలిసి చర్చించారు.
ఈ దాడిలో గాయపడి, ప్రస్తుతం కువైట్లోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న భారత జాతీయులను కూడా రాయబారి త్రిపాఠి పరామర్శించారు. ఆమె గాయపడిన వారితో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాయబార కార్యాలయం తరఫున సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వారికి హామీ ఇచ్చారు.
మృతుని కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, మృతదేహాన్ని త్వరితగతిన భారతదేశానికి తరలించేందుకు కువైట్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!









