డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- June 04, 2026
దుబాయ్: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెలివరీ రైడర్ల కోసం ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు (Rest Areas) పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. రైడర్ల భద్రత, ప్రమాదాల నివారణ, వారి జీవన ప్రమాణాల మెరుగుదల మరియు ట్రాఫిక్ నిబంధనల పాటింపును ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపింది.
ఆర్టీఏ వివరాల ప్రకారం, దుబాయ్లోని హెస్సా స్ట్రీట్, అల్ ఖవానీజ్, అల్ బర్షా, అల్ సత్వా, ఊద్ మైతా, అల్ కరామా, అర్జాన్ తదితర కీలక ప్రాంతాల్లో మొత్తం సుమారు 40 ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన నిర్వహణ, మరమ్మతులు మరియు ఇతర సన్నాహక పనులు పూర్తయ్యాయి.
డెలివరీ సేవలకు అధిక డిమాండ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి, డెలివరీ కంపెనీలతో సమన్వయం చేసుకుని ఈ కేంద్రాల స్థానాలను ఎంపిక చేసినట్లు ఆర్టీఏ వెల్లడించింది. ఇటీవల సంవత్సరాల్లో డెలివరీ రంగం వేగంగా విస్తరించిన నేపథ్యంలో రైడర్లకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
ఆర్టీఏ లైసెన్సింగ్ ఏజెన్సీ సీఈఓ అహ్మద్ మహ్బూబ్ మాట్లాడుతూ, “ట్రాఫిక్ భద్రత ఆర్టీఏకు అత్యున్నత ప్రాధాన్యం. దుబాయ్ను ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో డెలివరీ రంగానికి సమగ్ర పాలనా వ్యవస్థను రూపొందించాం” అని తెలిపారు.
విశ్రాంతి కేంద్రాల రూపకల్పనలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రత్యక్ష సూర్యకిరణాల ప్రభావాన్ని తగ్గించేలా, తగిన ఉష్ణ నిరోధక వ్యవస్థలతో వీటిని నిర్మించారు. ప్రతి కేంద్రంలో ఎయిర్ కండిషనింగ్ సదుపాయంతో పాటు తాగునీటి డిస్పెన్సర్లు, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.
ప్రాంతాన్ని బట్టి ఒక్కో కేంద్రంలో ఒకేసారి సుమారు 10 మంది రైడర్లు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే డెలివరీ మోటార్సైకిళ్ల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు మరియు రైడర్ల రోజువారీ అవసరాలకు అనుగుణంగా అదనపు సౌకర్యాలు కూడా కల్పించారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







