సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- June 05, 2026
లండన్: సౌదీ విద్యార్థి మహమ్మద్ అల్-ఖస్సిం హత్య కేసులో ప్రధాన నిందితుడైన చాజ్ కొరిగాన్కు యునైటెడ్ కింగ్డమ్లోని కేంబ్రిడ్జ్ క్రౌన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ హత్య సమయంలో నిందితుడు మాదకద్రవ్యాలు, మద్యం మత్తులో ఉన్నాడని నిర్ధారించారు. పెరోల్కు అర్హత సాధించడానికి కనీసం 22 సంవత్సరాల ఆరు నెలల పాటు జైలులో ఉండాలని న్యాయమూర్తి ఆదేశించారు.
2025 ఆగస్టులో కేంబ్రిడ్జ్లోని విద్యార్థుల హాస్టల్ వెలుపల అల్-ఖస్సిమ్ను మెడపై కత్తితో పొడిచి చంపారు. కేంబ్రిడ్జ్లోని హోల్బ్రూక్ రోడ్కు చెందిన నిర్మాణ కార్మికుడు చాజ్ కొరిగన్, డ్రగ్స్ మత్తులో వంటగది కత్తితో అల్-ఖస్సిమ్పై దాడి చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అలాగే, నేరస్థుడికి సహాయం చేసిన కొరిగన్ తండ్రి, 50 ఏళ్ల పీటర్ కొరిగన్కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. దాడి సమయంలో తన కుమారుడు ధరించిన డ్రెస్ ను అతను దాచిపెట్టాడని కోర్టు తెలిపింది. ఈ విచారణ సమయంలో అల్-ఖస్సిమ్ తండ్రి యూసెఫ్ అల్-ఖస్సిమ్ మరియు సోదరి షాతా అల్-ఖస్సిమ్ లు కోర్టులోనే ఉన్నారు.
యునైటెడ్ కింగ్డమ్ మరియు సౌదీ అరేబియా లో హై అలెర్ట్ క్రియేట్ చేసిన ఈ హత్య కేసుకు సంబంధించి నెలల తరబడి దర్యాప్తులు మరియు విచారణలు జరిగాయి. చివరకు నింతితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో కేసుకు ముగింపు పడింది. సౌదీ అరేబియాలోని మక్కాకు చెందిన 20 ఏళ్ల అల్-ఖస్సిం, కేంబ్రిడ్జ్లో 10 వారాల స్టడీ అసైన్మెంట్పై ఉన్న సమయంలో హత్యకు గురయ్యాడు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







