సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- June 05, 2026
లండన్: సౌదీ విద్యార్థి మహమ్మద్ అల్-ఖస్సిం హత్య కేసులో ప్రధాన నిందితుడైన చాజ్ కొరిగాన్కు యునైటెడ్ కింగ్డమ్లోని కేంబ్రిడ్జ్ క్రౌన్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ హత్య సమయంలో నిందితుడు మాదకద్రవ్యాలు, మద్యం మత్తులో ఉన్నాడని నిర్ధారించారు. పెరోల్కు అర్హత సాధించడానికి కనీసం 22 సంవత్సరాల ఆరు నెలల పాటు జైలులో ఉండాలని న్యాయమూర్తి ఆదేశించారు.
2025 ఆగస్టులో కేంబ్రిడ్జ్లోని విద్యార్థుల హాస్టల్ వెలుపల అల్-ఖస్సిమ్ను మెడపై కత్తితో పొడిచి చంపారు. కేంబ్రిడ్జ్లోని హోల్బ్రూక్ రోడ్కు చెందిన నిర్మాణ కార్మికుడు చాజ్ కొరిగన్, డ్రగ్స్ మత్తులో వంటగది కత్తితో అల్-ఖస్సిమ్పై దాడి చేశాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. అలాగే, నేరస్థుడికి సహాయం చేసిన కొరిగన్ తండ్రి, 50 ఏళ్ల పీటర్ కొరిగన్కు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. దాడి సమయంలో తన కుమారుడు ధరించిన డ్రెస్ ను అతను దాచిపెట్టాడని కోర్టు తెలిపింది. ఈ విచారణ సమయంలో అల్-ఖస్సిమ్ తండ్రి యూసెఫ్ అల్-ఖస్సిమ్ మరియు సోదరి షాతా అల్-ఖస్సిమ్ లు కోర్టులోనే ఉన్నారు.
యునైటెడ్ కింగ్డమ్ మరియు సౌదీ అరేబియా లో హై అలెర్ట్ క్రియేట్ చేసిన ఈ హత్య కేసుకు సంబంధించి నెలల తరబడి దర్యాప్తులు మరియు విచారణలు జరిగాయి. చివరకు నింతితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో కేసుకు ముగింపు పడింది. సౌదీ అరేబియాలోని మక్కాకు చెందిన 20 ఏళ్ల అల్-ఖస్సిం, కేంబ్రిడ్జ్లో 10 వారాల స్టడీ అసైన్మెంట్పై ఉన్న సమయంలో హత్యకు గురయ్యాడు.
తాజా వార్తలు
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్









