చంద్రబాబు కృష్ణా పుష్కరాలపై టెలీకాన్ఫరెన్స్‌..

- August 09, 2016 , by Maagulf
చంద్రబాబు కృష్ణా పుష్కరాలపై టెలీకాన్ఫరెన్స్‌..

కృష్ణా పుష్కరాలపై మంత్రులు, కలెక్టర్లు, వివిధశాఖల ఉన్నతాధికారులు, పుష్కరఘాట్ల ఇన్‌ఛార్జులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నదుల అనుసంధానంపై అందరూ దృష్టిపెట్టాలని, అందుకు కృష్ణాపుష్కరాల వేడుక వేదిక కావాలన్నారు. పుష్కరాలకు నిధులు లేకపోయినా సమీకరణ ద్వారా నిధుల కొరత లేకుండా చేస్తున్నామన్నారు. ఫ్లెక్సీ ఫండ్‌ విడుదల చేశాం, వాటిని సద్వినియోగం చేయాలని కోరారు. పుష్కర యాత్రికులకు సేవలు అందించేందుకు వలంటీర్లు ముందుకొస్తున్నారు.. వలంటీర్ల సేవలు సమర్థంగా వినియోగించుకోవాలని సీఎం సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com