నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- June 09, 2026
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (ఎస్ఎఫ్డీఏ) నిబంధనలు పాటించని 1,753 ఆహార సంస్థలను గుర్తించి, వాటిపై చర్యలు తీసుకుంది. నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా లేని 1,057 టన్నుల ఉత్పత్తుల ప్రవేశాన్ని అడ్డుకున్నట్లు అథారిటీ తెలిపింది. ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎస్ఎఫ్డీఏ 12,260 సంస్థలలో 15,200 కంటే ఎక్కువ తనిఖీ పర్యటనలు నిర్వహించింది. ఈ తనిఖీల ఫలితంగా నిబంధనలు ఉల్లంఘించిన 1,753 సంస్థలను గుర్తించడం మరియు నిబంధనలకు అనుగుణంగా లేని 1,057 టన్నుల ఆహార ఉత్పత్తులను అడ్డుకోవడం జరిగిందని పేర్కొంది.
లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహించడం, ఎస్ఎఫ్డీఏ ఆమోదించని ఉత్పత్తులను పంపిణీ చేయడం మరియు సంబంధిత సాంకేతిక నిబంధనలను ఉల్లంఘించడం వంటివి అత్యంత సాధారణ ఉల్లంఘనలలో ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. లిస్టేరియా, సాల్మొనెల్లా, ఇ. కోలి వంటి ఆహార సంబంధిత అనారోగ్యాలకు కారణమయ్యే సూక్ష్మజీవులతో ఉత్పత్తులు కలుషితం కావడమే ఈ నిషేధాలకు ప్రధాన కారణమని తెలిపింది. నిబంధనలకు విరుద్ధమైన ఉత్పత్తులు స్థానిక మార్కెట్లకు చేరకుండా నిరోధించడానికి తాము చేస్తున్న నిరంతరం ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నది. ఉల్లంఘనలకు విధించే శిక్షలలో వ్యాపారం మూసివేత, జైలు శిక్ష, లేదా SR10 మిలియన్ల వరకు జరిమానాలు ఉండవచ్చని హెచ్చరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







