భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!

- June 09, 2026 , by Maagulf
భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!

మస్కట్: ఒమన్ తీరం వద్ద 'MT మారివెక్స్' (MT Marivex) నౌకకు సంబంధించిన ఘటన తర్వాత, వేగంగా చేపట్టిన రక్షణ చర్యలకు గాను ఒమన్ అధికారులకు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. నౌకలో ఉన్న 24 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు రాయబార కార్యాలయం 'X' (ట్విట్టర్) వేదికగా ధృవీకరించింది. MT మారివెక్స్‌లో ఉన్న 24 మంది భారతీయ సిబ్బందిని రక్షించడంలో ఒమన్ అధికారులు చూపిన వేగవంతమైన స్పందనకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాయబార కార్యాలయం పేర్కొంది.

అంతకు ముందు, నౌకపై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని మరియు ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటన సిబ్బంది భద్రతపై  ఒమన్ అధికారులతో భారత దౌత్య అధికారులు సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. విజయవంతమైన రక్షణ చర్యల ఫలితంగా, ఎటువంటి ప్రాణనష్టం లేకుండా నావికులందరినీ సురక్షితంగా రక్షించారు. దాడికి సంబంధించిన తదుపరి వివరాలను రాయబార కార్యాలయం ఇంకా వెల్లడించలేదు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com