భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- June 09, 2026
మస్కట్: ఒమన్ తీరం వద్ద 'MT మారివెక్స్' (MT Marivex) నౌకకు సంబంధించిన ఘటన తర్వాత, వేగంగా చేపట్టిన రక్షణ చర్యలకు గాను ఒమన్ అధికారులకు మస్కట్లోని భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. నౌకలో ఉన్న 24 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా రక్షించినట్లు రాయబార కార్యాలయం 'X' (ట్విట్టర్) వేదికగా ధృవీకరించింది. MT మారివెక్స్లో ఉన్న 24 మంది భారతీయ సిబ్బందిని రక్షించడంలో ఒమన్ అధికారులు చూపిన వేగవంతమైన స్పందనకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాయబార కార్యాలయం పేర్కొంది.
అంతకు ముందు, నౌకపై దాడి జరిగిందన్న వార్తల నేపథ్యంలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నామని మరియు ఒమన్ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని రాయబార కార్యాలయం తెలిపింది. ఈ ఘటన సిబ్బంది భద్రతపై ఒమన్ అధికారులతో భారత దౌత్య అధికారులు సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. విజయవంతమైన రక్షణ చర్యల ఫలితంగా, ఎటువంటి ప్రాణనష్టం లేకుండా నావికులందరినీ సురక్షితంగా రక్షించారు. దాడికి సంబంధించిన తదుపరి వివరాలను రాయబార కార్యాలయం ఇంకా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!









