మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- June 09, 2026
కువైట్: సమ్మర్ లో పగటిపూట బహిరంగ ప్రదేశాలలో కార్మికులను నియమించడంపై కువైట్ విధించిన నిషేధాన్ని పాటిస్తున్నారో లేదో నిర్ధారించుకోవడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్పవర్ (PAM) తనిఖీలను ముమ్మరం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, పరిస్థితిని సరిదిద్దే వరకు యజమానుల కార్మిక ఫైళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తామని హెచ్చరించింది. నిషేధిత సమయంలో కార్మికులు బహిరంగ ప్రదేశాలలో విధులు నిర్వహిస్తున్నట్లు తేలితే, యజమాని ఫైల్ను తాత్కాలికంగా నిలిపివేయడానికి 2010 నాటి చట్టం నెం. 6 కింద నిర్దేశించిన జరిమానాలు విధిస్తామని పేర్కొంది. ఉల్లంఘనలను తమ హాట్లైన్ నంబర్ 24936192 ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరింది. ఉల్లంఘనను సరిదిద్దే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల నుండి కార్మికులను రక్షించడం మరియు కార్మిక నిబంధనలను పాటించేలా చూడటం పట్ల తమ నిబద్ధతను ఇది స్పష్టం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







