ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- June 10, 2026
దోహా: ఖతారీ తల్లుల పిల్లలు మరియు ఖతార్ రాష్ట్రంలో జన్మించిన ఖతారీయేతర నివాసితుల పిల్లలు ఇప్పుడు జాతీయ సేవా కార్యక్రమంలో చేరడానికి అర్హులని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా కొన్ని అర్హతా ప్రమాణాలను వెల్లడించింది.
దరఖాస్తు దారులు ఖతార్లో జన్మించి ఉండాలి. కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నమ్మకద్రోహానికి సంబంధించిన నేరాలకు పాల్పడి శిక్షించబడి ఉండకూడదు. వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రవేశ ఇంటర్వ్యూలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలి. చెల్లుబాటు అయ్యే ఖతార్ నివాస అనుమతిని కలిగి ఉండాలి.
వీటితోపాటు ఖతార్ గుర్తింపు కార్డు కాపీ, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ కాపీ, ఖతార్లో జన్మించిన వారు జనన ధృవీకరణ పత్రం కాపీ, ఖతారీ తల్లుల పిల్లలకు సంబందించి తల్లి పాస్పోర్ట్ మరియు జనన ధృవీకరణ పత్రం కాపీలను దరఖాస్తులకు జతచేయాలని పేర్కొంది.
ఇక సేవా కాలం ఐదు సంవత్సరాల వరకు పొడిగించవచ్చని మరియు నెలకు QAR 7,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం ఉంటుందని తెలిపింది. వారికి ఖతార్ సాయుధ దళాలలో నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. అలాగే వారి సేవను పూర్తి చేసిన తర్వాత శాశ్వత నివాసం పొందడంలో కూడా ప్రాధాన్యత లభిస్తుందని తెలిపింది. దరఖాస్తులను బ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్గా సమర్పించాలని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్ల ట్రయల్స్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- ఏపీ ప్రజలకు విశాఖ AIG గుడ్ న్యూస్
- విద్యార్థులపై అరాచకాలకు పాల్పడిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: CJI
- శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ప్రధాని మోదీ వీడియో నిలిపివేత: కేంద్ర ప్రభుత్వానికి మెటా క్షమాపణలు!
- డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడితే భారీ జరిమానా..
- ప్రధాని మోదీతో స్కైరూట్ ఫౌండర్లు భేటీ: ‘విక్రమ్-1’ విజయవంతంపై ప్రశంసల వర్షం!
- ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్
- ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!







