ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- June 10, 2026
దోహా: ఖతారీ తల్లుల పిల్లలు మరియు ఖతార్ రాష్ట్రంలో జన్మించిన ఖతారీయేతర నివాసితుల పిల్లలు ఇప్పుడు జాతీయ సేవా కార్యక్రమంలో చేరడానికి అర్హులని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా కొన్ని అర్హతా ప్రమాణాలను వెల్లడించింది.
దరఖాస్తు దారులు ఖతార్లో జన్మించి ఉండాలి. కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నమ్మకద్రోహానికి సంబంధించిన నేరాలకు పాల్పడి శిక్షించబడి ఉండకూడదు. వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రవేశ ఇంటర్వ్యూలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలి. చెల్లుబాటు అయ్యే ఖతార్ నివాస అనుమతిని కలిగి ఉండాలి.
వీటితోపాటు ఖతార్ గుర్తింపు కార్డు కాపీ, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ కాపీ, ఖతార్లో జన్మించిన వారు జనన ధృవీకరణ పత్రం కాపీ, ఖతారీ తల్లుల పిల్లలకు సంబందించి తల్లి పాస్పోర్ట్ మరియు జనన ధృవీకరణ పత్రం కాపీలను దరఖాస్తులకు జతచేయాలని పేర్కొంది.
ఇక సేవా కాలం ఐదు సంవత్సరాల వరకు పొడిగించవచ్చని మరియు నెలకు QAR 7,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం ఉంటుందని తెలిపింది. వారికి ఖతార్ సాయుధ దళాలలో నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. అలాగే వారి సేవను పూర్తి చేసిన తర్వాత శాశ్వత నివాసం పొందడంలో కూడా ప్రాధాన్యత లభిస్తుందని తెలిపింది. దరఖాస్తులను బ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్గా సమర్పించాలని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- దుబాయ్ వాటర్ఫ్రంట్ రెస్టారెంట్ సమీపంలో వేల్ షార్క్ హల్చల్..!!
- రబీగ్ తీరంలో ఏడుగురిని రక్షించిన భద్రతా దళాలు..!!
- అల్ ముగ్సైల్ రోడ్ బ్రిడ్జ్ 85% పూర్తి.. జూలైలో ప్రారంభం..!!
- కువైట్ సార్వభౌమాధికారానికి భారత్ మద్దతు..!!
- సరికొత్త ఇంటరాక్టివ్ షోలతో రాబోతున్న టాయ్ ఫెస్టివల్..!!
- ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత..
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం









