ఖతారీ మదర్, ఖతార్లో జన్మించిన పిల్లల ఎన్రోల్మెంట్..!!
- June 10, 2026
దోహా: ఖతారీ తల్లుల పిల్లలు మరియు ఖతార్ రాష్ట్రంలో జన్మించిన ఖతారీయేతర నివాసితుల పిల్లలు ఇప్పుడు జాతీయ సేవా కార్యక్రమంలో చేరడానికి అర్హులని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ మేరకు తన ఎక్స్ అకౌంట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా కొన్ని అర్హతా ప్రమాణాలను వెల్లడించింది.
దరఖాస్తు దారులు ఖతార్లో జన్మించి ఉండాలి. కనీసం 18 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నమ్మకద్రోహానికి సంబంధించిన నేరాలకు పాల్పడి శిక్షించబడి ఉండకూడదు. వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రవేశ ఇంటర్వ్యూలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలి. చెల్లుబాటు అయ్యే ఖతార్ నివాస అనుమతిని కలిగి ఉండాలి.
వీటితోపాటు ఖతార్ గుర్తింపు కార్డు కాపీ, చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ కాపీ, ఖతార్లో జన్మించిన వారు జనన ధృవీకరణ పత్రం కాపీ, ఖతారీ తల్లుల పిల్లలకు సంబందించి తల్లి పాస్పోర్ట్ మరియు జనన ధృవీకరణ పత్రం కాపీలను దరఖాస్తులకు జతచేయాలని పేర్కొంది.
ఇక సేవా కాలం ఐదు సంవత్సరాల వరకు పొడిగించవచ్చని మరియు నెలకు QAR 7,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం ఉంటుందని తెలిపింది. వారికి ఖతార్ సాయుధ దళాలలో నియామకాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు. అలాగే వారి సేవను పూర్తి చేసిన తర్వాత శాశ్వత నివాసం పొందడంలో కూడా ప్రాధాన్యత లభిస్తుందని తెలిపింది. దరఖాస్తులను బ్సైట్ ద్వారా ఎలక్ట్రానిక్గా సమర్పించాలని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- Dubai Media Council announces return of Dubai International Film Festival
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ







