జెడ్డాలో 20 టన్నుల పాడైన ఆహారం ధ్వంసం..!!
- June 10, 2026
జెడ్డా: జెడ్డా నగర తూర్పు ప్రాంతంలో మానవ వినియోగానికి పనికిరాని సుమారు 20 టన్నుల పాడైన ఆహారాన్ని జెడ్డా మున్సిపాలిటీ అధికారులు ధ్వంసం చేశారు. అలాగే, ఆరోగ్య మరియు మున్సిపల్ నిబంధనలను పాటించని ఒక అనధికారిక పేస్ట్రీ మరియు స్వీట్ల తయారీ యూనిట్ను అధికారులు మూసివేశారు.
నివాస భవనంలో అనధికారికంగా నడుస్తున్న ఒక తయారీ యూనిట్ను తనిఖీ బృందాలు గుర్తించాయని మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ యాసర్ బిన్ సిరాజ్ బక్ష్ తెలిపారు. అక్కడ నుండి పాడైపోయిన ముడి సరుకులు మరియు ఆహార పదార్థాలను గుర్తించి, సీజ్ చేశారు. మానవ వినియోగానికి పనికిరాకపోవడంతో అక్కడ లభించిన ఆహార పదార్థాలన్నింటినీ, అలాగే తయారీకి ఉపయోగించిన పరికరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు పూర్తయ్యే వరకు ఆ కేంద్రాన్ని పూర్తిగా మూసివేసినట్లు పేర్కొన్నారు.
ప్రజా ఆరోగ్యం మరియు వినియోగదారుల భద్రతకు ముప్పు కలిగించే అక్రమ కార్యకలాపాలను పర్యవేక్షించడం, అరికట్టడం వంటి చర్యలు జెడ్డా మున్సిపాలిటీ నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఉంటాయని మున్సిపాలిటీ డైరెక్టర్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్లో ఆలీ వాక్వేకు కొత్త రూపు..!!
- ఖతార్లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్వేస్తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







