తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!

- June 11, 2026 , by Maagulf
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!

విద్యా సంవత్సరం ప్రారంభమైన వేళ చాలావరకు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో, నిబంధనలకు విరుద్ధంగా ఫీజుల దోపిడీకి పాల్పడే ప్రైవేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాల విద్యాశాఖలు సిద్ధమయ్యాయి. చట్టవిరుద్ధంగా డొనేషన్లు, అడ్మిషన్ ఫీజులు లేదా పుస్తకాలు, యూనిఫారాల పేరిట అదనపు వసూళ్లకు పాల్పడితే తల్లిదండ్రులు నేరుగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. బాధ్యులైన స్కూళ్ల గుర్తింపు రద్దు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఫిర్యాదు చేయాల్సిన హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

ఫీజుల నియంత్రణకు గానూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు, హెల్ప్‌లైన్లను అందుబాటులోకి తెచ్చాయి. తల్లిదండ్రులు ఎలాంటి భయాందోళనలు లేకుండా కింది నంబర్లను సంప్రదించి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చు:

తెలంగాణ: తల్లిదండ్రులు 1800-425-7462 లేదా 040-23232343 నంబర్లకు కాల్ చేయవచ్చు. అలాగే విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదును సమర్పించవచ్చు.
ఆంధ్రప్రదేశ్: ఫీజుల నియంత్రణ కమిషన్ నంబర్ 08645 274445కు గానీ, విద్యాశాఖ హెల్ప్‌లైన్ నంబర్లు 1800-425-8599 లేదా 1902కు కాల్ చేసి నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయ గ్రీవెన్స్‌కు సైతం ఫిర్యాదును చేరవేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com