హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్

- June 11, 2026 , by Maagulf
హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్

న్యూ ఢిల్లీ: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఆర్థిక, అభివృద్ధి వ్యూహాన్ని కేంద్రం ముందుంచారు. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొని, రాష్ట్ర ప్రయోజనాలతో పాటు దేశ ఆర్థిక ప్రగతిపై కీలక ప్రతిపాదనలు చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి చోదక శక్తులుగా (Growth Engines) నిలుస్తున్న హైదరాబాద్‌తో పాటు మరో ఐదు మెట్రో నగరాల సమగ్ర విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర బడ్జెట్ నుండి ఒక్కో నగరానికి రూ. లక్ష కోట్ల చొప్పున ప్రత్యేక నిధులను కేటాయించాలని ప్రధాని మోదీని సూటిగా కోరారు. ఈ నిధుల ద్వారా మెట్రో రైల్ విస్తరణ, గ్రీన్ ఎనర్జీ, స్మార్ట్ గవర్నెన్స్ మరియు అత్యాధునిక డిజిటల్ ల్యాండ్‌స్కేప్‌ను నిర్మించవచ్చని ఆయన కేంద్రానికి వివరించారు.

దేశంలోనే అత్యంత కీలకమైన ఆరు మెట్రో నగరాలను (హైదరాబాద్, న్యూఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు) కలిపి ‘M6’ (Mega 6 Cities) గా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఈ ఆరు మెట్రో నగరాలు భారతదేశ మొత్తం జనాభాలో కేవలం 10 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) లో ఏకంగా 25 శాతం భారీ వాటాను సమకూరుస్తున్నాయని గణాంకాలతో సహా నిరూపించారు. ఈ నగరాల ఆర్థిక సామర్థ్యాన్ని మరింతగా వెలికితీసేందుకు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పర్యవేక్షణలోనే ఒక ప్రత్యేక ‘M6 టాస్క్ ఫోర్స్’ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తే, మెట్రో నగరాల్లో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు అభివృద్ధి చెంది, దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు బలమైన పునాది పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com