65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- June 13, 2026
హైదరాబాద్: పోలీసు సంక్షేమానికి ప్రతీకగా నిలిచిన 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను తెలంగాణ డీజీపీ సి.వి.ఆనంద్ శుక్రవారం సందర్శించి సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మెస్ ప్రాంగణాన్ని మొత్తం పరిశీలించిన డీజీపీ, అక్కడి మౌలిక సదుపాయాలు, నిర్వహణ విధానం, సిబ్బంది అవసరాలపై అధికారులతో చర్చించారు. మెస్లోని వివిధ విభాగాలను స్వయంగా పరిశీలిస్తూ ఆధునికీకరణ చర్యల పై సూచనలు చేశారు.
పోలీసు అధికారుల అవసరాలకు అనుగుణంగా మెస్ను మరింత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించిన డీజీపీ, భవన నిర్వహణను మెరుగుపరచడంతో పాటు ఆధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
అలాగే, పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ స్థలాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెస్ నిర్వహణను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు హెచ్ఆర్ఎన్ఎస్ (HRNS) పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు.
పోలీసు అధికారుల సంక్షేమం, సౌకర్యాల మెరుగుదల పోలీసు శాఖ ప్రాధాన్య అంశాల్లో ఒకటని డీజీపీ పేర్కొన్నారు.చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ మెస్ను ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









