ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- June 13, 2026
అబుదాబి: యూఏఈ నుంచి ఇరాన్కు నిధులు బదిలీ చేసినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలను యూఏఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా 3 బిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల బదిలీకి సంబంధించిన ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది.
ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఇరాన్కు చెందిన ఎలాంటి స్తంభింపజేసిన (ఫ్రోజన్) నిధులు విడుదల కాలేదని, బదిలీ చేయలేదని, అలాంటి లావాదేవీలకు యూఏఈ ఎలాంటి సౌకర్యం కల్పించలేదని పేర్కొంది.
ఇరాన్కు భారీ మొత్తంలో నిధులు తరలించారనే వార్తలకు ఎలాంటి ఆధారాలు లేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, వాస్తవాలకు విరుద్ధమని స్పష్టం చేసింది.
అదేవిధంగా, వార్తా సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారిక వనరుల నుంచి సమాచారం సేకరించి మాత్రమే వార్తలను ప్రచురించాలని యూఏఈ సూచించింది. ధృవీకరించని సమాచారం, నిరాధార ఆరోపణలను ప్రచారం చేయకుండా మీడియా సంస్థలు జాగ్రత్త వహించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
ఈ నేపథ్యంలో యూఏఈ తన ఆర్థిక వ్యవస్థ పారదర్శకత, అంతర్జాతీయ నిబంధనల పట్ల కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









