ఒమాన్ సుల్తానేట్‌కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే

- June 13, 2026 , by Maagulf
ఒమాన్ సుల్తానేట్‌కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే

న్యూఢిల్లీ: ఒమాన్ సుల్తానేట్‌కు భారతదేశ రాయబారిగా నియమితులైన (Ambassador Designate) ప్రశాంత్ పిసే, తన కొత్త బాధ్యతల స్వీకరణకు సంబంధించిన క్రెడెన్షియల్ లేఖలను స్వీకరించేందుకు భారత రాష్ట్రపతి ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్రపతి పిసేకు క్రెడెన్షియల్ లేఖలను అందజేశారు. ఒమాన్‌లో భారతదేశ ప్రతినిధిగా ఆయన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు.

భారత్–ఒమాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, సాంస్కృతిక రంగాలు మరియు ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు కృషి చేయాల్సిన బాధ్యతలను  పిసే చేపట్టనున్నారు.

ప్రశాంత్ పిసే త్వరలో ఒమాన్ రాజధాని మస్కట్‌లో బాధ్యతలు స్వీకరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com