ఒమన్ లో ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!

- June 14, 2026 , by Maagulf
ఒమన్ లో  ఒక్క రోజులోనే భారతీయ పాస్ పోర్ట్ ప్రక్రియ పూర్తి..!!

మస్కట్: ఒమన్ లో భారత రాయబారిగా బాధ్యతలు ముగించుకుని వెళ్తున్న జి.వి. శ్రీనివాస్.. భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పుడు పోలీసు ధృవీకరణకు లోబడి కేవలం ఒక్క రోజులోనే పూర్తవుతోందని ప్రకటించారు. షెరటన్ ఒమన్ హోటల్లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తన 15 నెలల పదవీకాలాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఒమన్ దేశానికి, అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవీకాలంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించచినట్లు పేర్కొన్నారు.

అలాగే, తన పదవీకాలంలో ఒమన్ అధికారులు, ఇండియన్ కమ్యూనిటీ మరియు వివిధ వర్గాల నుండి లభించిన మద్దతును ఆయన గుర్తుచేసుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒమన్ లో జరిపిన విజయవంతమైన పర్యటన తన పదవీకాలంలో ముఖ్య ఘట్టాలలో ఒకటని  శ్రీనివాస్ ప్రస్తావించారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాల విషయంలో సహకారాన్ని మరింత బలోపేతం చేసిందన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com