ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!

- June 14, 2026 , by Maagulf
ప్రభుత్వ స్టాంపులు ఫోర్జరీ.. ఐదుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్..!!

కువైట్: ప్రభుత్వ స్టాంపులను నకిలీ చేసి, వాటి అధికారిక విలువ కంటే తక్కువ ధరలకు విక్రయించారన్న ఆరోపణలపై ఐదుగురు బంగ్లాదేశీ జాతీయులను అరెస్టు చేసినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెసిడెన్స్ అఫైర్స్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ జరిపిన దర్యాప్తు మరియు నిఘా సమాచారం ఆధారంగా, జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ఈ అరెస్టులను చేపట్టిందన్నారు.

ఈ ఐదుగురు సభ్యుల ముఠా అధికారిక ప్రభుత్వ స్టాంపులను ఫోర్జరీ చేసి, వాటిని చట్టవిరుద్ధ మార్గాల ద్వారా పంపిణీ చేయడంలో నైపుణ్యం కలిగి ఉందని పేర్కొంది. అనుమానితులు ఆసుపత్రుల పరిసరాల్లో నకిలీ స్టాంపులను విక్రయిస్తూ  లాభాలు ఆర్జించడం కోసం KD 5 మరియు KD 10 విలువ గల స్టాంపులను వాటి అధికారిక విలువ కంటే తక్కువ ధరలకు అమ్ముతున్నారని తెలిపారు. నిందితుల నుంచి ఒక ల్యాప్టాప్, ఒక ప్రింటర్ మరియు స్టాంప్ పేపర్ రోల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com