ఫేక్ కన్జూమర్ ప్రొటెక్షన్ వెబ్సైట్ల పై అబుదాబి పోలీసులు హెచ్చరిక..!!
- June 14, 2026
యూఏఈ: కన్జూమర్ ప్రొటెక్షన్ సేవల పేరిట మోసపూరిత వెబ్సైట్లు మరియు ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల గురించి అబుదాబి పోలీసులు నివాసితులను హెచ్చరించారు. బాధితుల నుండి వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ సమాచారాన్ని రాబట్టడానికి మోసగాళ్లు సెర్చ్ ఇంజిన్లను ఉపయోగిస్తున్నారని వారు తెలిపారు. ఈ ఫేక్ వెబ్సైట్లు అధికారిక వినియోగదారుల రక్షణ సంస్థలను పోలి ఉండేలా ఉంటాయన్నారు. చట్టబద్ధంగా కనిపించడానికి, అవి తరచుగా అవే పేర్లు, లోగోలు మరియు బ్రాండింగ్ను ఉపయోగిస్తాయని తెలిపారు. ఉత్పత్తులు, వాణిజ్య సేవలు లేదా రిటైల్ దుకాణాల గురించి ఫిర్యాదులు చేయాలనుకునే వారిని ఈ ప్లాట్ఫారమ్లు లక్ష్యంగా చేసుకుంటాయని పేర్కొన్నారు.
కన్జూమర్ ప్రొటెక్షన్ సేవల కోసం ఆన్లైన్లో వెతికే బాధితులు ఈ మోసపూరిత వెబ్సైట్ల బారీన పడే అవకాశం ఉందని అబుదాబి పోలీసులు తెలిపారు. అక్కడ, ఫిర్యాదును పరిష్కరించడం లేదా సహాయం అందించడం పేరిట వారి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను అందించమని అడుగుతారని, కొన్ని సందర్భాల్లో, మోసగాళ్లు సున్నితమైన సమాచారాన్ని దొంగిలించేందుకు వీలుగా, వారి పరికరాలకు రిమోట్ యాక్సెస్ ఇచ్చే అప్లికేషన్లు లేదా సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేసుకోమని వినియోగదారులను ఒప్పించడానికి కూడా ప్రయత్నిస్తారని హెచ్చరించారు.
ఆన్లైన్లో వినియోగదారుల రక్షణ సేవల కోసం వెతికేటప్పుడు జాగ్రత్త వహించాలని, అలాగే ఎలాంటి సమాచారాన్ని పంచుకునే ముందు వెబ్సైట్లు మరియు లింకుల ప్రామాణికతను ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలను కోరారు. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను వెల్లడించవద్దని లేదా చెల్లింపులు చేయవద్దని నివాసితులకు సూచించారు. ఆన్లైన్లో ప్రభుత్వ సంస్థలు వలె కనిపించే వెబ్సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్
- యెమెన్ సముద్ర జలాల్లో మునిగిన భారత కార్గో నౌక..
- 18 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సృష్టించిన యువ ప్రొఫెసర్ నాథన్ థామస్
- గుజరాత్లో విజృంభిస్తున్న చాందీపురా వైరస్
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..







