కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- June 14, 2026
కువైట్: కువైట్ లో అర్హులైన విదేశీ పెట్టుబడిదారులకు 15 సంవత్సరాల వరకు చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ అనుమతులను పొందేందుకు వీలు కల్పించే కొత్త ప్రేమ్ వర్క్ ను కువైట్ కేబినెట్ ఆమోదించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక అథారిటీ సిఫార్సు ఆధారంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని రెసిడెన్సీ వ్యవహారాల జనరల్ డైరెక్టరేట్ 15 సంవత్సరాల నివాస అనుమతిని జారీ చేస్తుంది.
ఈ రెసిడెన్సీ పథకం, అథారిటీ ఆమోదించిన పదవులలో ఉన్న పెట్టుబడి సంస్థల యజమానులు, భాగస్వాములు, మేనేజర్లు మరియు సీనియర్ మేనేజ్మెంట్ సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. కాగా, అర్హత సాధించడానికి, పెట్టుబడి సంస్థ DIPA జారీ చేసిన చెల్లుబాటు అయ్యే పెట్టుబడి లైసెన్స్ను కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు చెల్లుబాటు అయ్యే పాస్పోర్ట్ మరియు క్రిమినల్ రికార్డ్ సర్టిఫికేట్ను కూడా అందించాలి.
పెట్టుబడి సంస్థ కనీసం KD 5 మిలియన్ల పెట్టుబడి పరిమాణాన్ని మరియు కనీసం KD 1 మిలియన్ మూలధనాన్ని కలిగి ఉండాలి. అవసరమైన అన్ని పత్రాలు సమర్పించిన ఐదు పనిదినాలలోపు DIPA దరఖాస్తులను సమీక్షించి నిర్ణయం జారీ చేస్తుంది.
తాజా వార్తలు
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్కు కొత్త అద్దె సూచిక.. కొత్త చట్టంతో పారదర్శకతకు ప్రాధాన్యం
- కువైట్లో వారం రోజుల్లో 25 వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- మస్కట్లో అల్ అమెరికాత్ ఓవర్పాస్ తాత్కాలికంగా మూసివేత..!!
- సోషల్ మీడియాలో పిల్లల ఫొటోల షేరింగ్ పై అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- అబుదాబి నుంచి భారత్ లోని నాలుగు కొత్త నగరాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్స్..!!
- అమ్మాన్లో అరబ్ దేశాల కీలక సమావేశం.. ఇజ్రాయెల్ చర్యలపై తీవ్ర ఆందోళన..!!
- సౌదీలో డొమెస్టిక్ వర్కర్ల బదిలీకి కొత్త సర్వీస్..!!
- హర్మూజ్ జలసంధిలో కొత్త వాణిజ్య మార్గంపై ఇరాన్, ఒమన్ మధ్య అంగీకారం
- పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆప్'కే స్వల్ప ఆధిక్యం: 'పీపుల్స్ పల్స్' మూడ్ సర్వే







