సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- June 14, 2026
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకున్నారు. ఆయనకు అక్కడి తెలుగు సంఘాలు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చి సీఎంను కలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు వారిని పలకరించి, కొందరితో ఫోటోలు దిగారు.ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రపంచ నగరాల సదస్సు (World Cities Summit)లో పాల్గొననున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఆయన సింగపూర్లోని పలు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా పెట్టుబడుల అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి.
అలాగే సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, అక్కడి మంత్రులు, అమరావతి రెండో దశ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న సుర్బానా-జురాంగ్ ప్రతినిధులతో కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. భారత హైకమిషనర్ శిల్పక్ అంబులేతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో వరుసగా చర్చలు జరిపి రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి సారించనున్నారు.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









