కేరళలో హ్యాపీ రీ-రిలీజ్.. కొత్త సినిమా రేంజ్లో రికార్డు కలెక్షన్లు
- June 15, 2026
సినిమా విడుదలై దాదాపు 20 ఏళ్లు గడిచినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై కేరళ ప్రేక్షకుల అభిమానం ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. రీసెంట్గా 4K హంగులతో మళ్లీ థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో అల్లు అర్జున్కు ఎంత క్రేజ్ ఉందో.. కేరళలోనూ అంతే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ బన్నీని అభిమానులు ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు. జూన్ 11న మలయాళంలో ‘హ్యాపీ బీ హ్యాపీ’ పేరుతో రిలీజైన ఈ రీ-రిలీజ్ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.
సరికొత్త సినిమా రేంజ్లో రికార్డు కలెక్షన్లు
కేరళలోని ప్రధాన నగరాల్లో ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఒక కొత్త సినిమా విడుదలైన రేంజ్లో ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ చిత్రం మొదటి రోజే 30 లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేసి.. కేవలం మూడు రోజుల్లోనే కోటి రూపాయల మార్కును దాటేసింది. 2026లో కేరళలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాలీవుడ్ రీ-రిలీజ్ చిత్రంగా ‘హ్యాపీ’ నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు లిమిటెడ్ షోలు వేస్తారు, కానీ బన్నీ క్రేజ్ చూసి అక్కడ థియేటర్ల కౌంట్ను 120 స్క్రీన్స్కు పెంచడం విశేషం.
థియేటర్లో చిందేసిన ‘విత్ లవ్’ బ్యూటీ అనస్వర రాజన్
అల్లు అర్జున్ ఎంట్రీ సీన్స్, ముఖ్యంగా ‘వస్సా రే వస్సా రే’ సాంగ్ వస్తున్నప్పుడు థియేటర్లు స్టేడియంలను తలపించాయి. ఈ క్రమంలోనే మలయాళ క్రేజీ యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ తన సోదరి ఐశ్వర్య, స్నేహితులతో కలిసి థియేటర్లో తెగ హంగామా చేశారు. బన్నీ పాటలకు స్క్రీన్ ముందు మాస్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల ‘విత్ లవ్’, ‘రేఖచిత్రం’ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న అనస్వర రాజన్.. తాను చిన్నప్పటి నుండి అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ అని, అందుకే థియేటర్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నానని వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









