డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- June 17, 2026
యూఏఈ: ఎమిరేట్స్ లో డ్రగ్స్ ను పంపిణీ చేయడానికి పన్నిన నేరపూరిత కుట్రను భగ్నం చేసినట్టు యూఏఈ మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ తెలిపింది. ఫెడరల్ నార్కోటిక్స్ కంట్రోల్ ప్రాసిక్యూషన్ నుండి అందిన సమాచారం మేరకు, రాస్ అల్ ఖైమా పోలీసుల సమన్వయంతో ముఠాలోని సభ్యులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది.
ఈ ఆపరేషన్ సందర్భంగా భారీ పరిమాణంలో మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో పాల్గొన్న 24 మంది నేరస్థులందరి గుర్తింపును పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
కేసు వివరాల ప్రకారం, ఎమిరేట్స్లో ఒకదానిలోని ఒక ప్రదేశంలో మాదకద్రవ్యాలు దాచిపెట్టారని అధికారులకు సమాచారం అందింది. ప్రత్యేక బృందాలు వెంటనే గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో మాదకద్రవ్యాలను తరలించడానికి ప్రయత్నిస్తున్న నేర ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు దుబాయ్, అబుదాబి, అజ్మాన్లలో మరో 10 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్
- యెమెన్ సముద్ర జలాల్లో మునిగిన భారత కార్గో నౌక..
- 18 ఏళ్లకే గిన్నిస్ రికార్డు సృష్టించిన యువ ప్రొఫెసర్ నాథన్ థామస్
- గుజరాత్లో విజృంభిస్తున్న చాందీపురా వైరస్
- ఇక ఇంటింటికీ ఇంటర్నెట్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
- దుబాయ్ కార్ షోరూమ్ పేలుడు ఘటనలో మృతి చెందినది భారతీయుడే..







