డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- June 17, 2026
యూఏఈ: ఎమిరేట్స్ లో డ్రగ్స్ ను పంపిణీ చేయడానికి పన్నిన నేరపూరిత కుట్రను భగ్నం చేసినట్టు యూఏఈ మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ తెలిపింది. ఫెడరల్ నార్కోటిక్స్ కంట్రోల్ ప్రాసిక్యూషన్ నుండి అందిన సమాచారం మేరకు, రాస్ అల్ ఖైమా పోలీసుల సమన్వయంతో ముఠాలోని సభ్యులను అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది.
ఈ ఆపరేషన్ సందర్భంగా భారీ పరిమాణంలో మాదకద్రవ్యాలు మరియు సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో పాల్గొన్న 24 మంది నేరస్థులందరి గుర్తింపును పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
కేసు వివరాల ప్రకారం, ఎమిరేట్స్లో ఒకదానిలోని ఒక ప్రదేశంలో మాదకద్రవ్యాలు దాచిపెట్టారని అధికారులకు సమాచారం అందింది. ప్రత్యేక బృందాలు వెంటనే గాలింపు ప్రారంభించాయి. ఈ క్రమంలో మాదకద్రవ్యాలను తరలించడానికి ప్రయత్నిస్తున్న నేర ముఠాకు చెందిన ఇద్దరు సభ్యులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం మేరకు దుబాయ్, అబుదాబి, అజ్మాన్లలో మరో 10 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !









