సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్కు గురవుతున్నారు..!!
- June 19, 2026
రియాద్: సౌదీ అరేబియాలో 15 ఏళ్లలోపు పిల్లలలో సుమారు 65 శాతం మంది తమ వయసుకు తగని సినిమాలు, గేమ్లు లేదా ఇతర కంటెంట్ కు గురవుతున్నారు. ఈ మేరకు కింగ్ ఖాలిద్ ఫౌండేషన్ ఇటీవల విడుదల చేసిన ఒక పరిశోధన నివేదిక తెలియజేసింది. "ది నెక్ట్స్ జెనరేషన్ సౌదీస్: చైల్డ్ వుడ్ ఇన్ సౌదీ అరేబియా" అనే టైటిల్ లో ఉన్న ఈ నివేదిక, 2025లో సౌదీ సొసైటీటీ పేరుతో సౌదీ సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ సర్వేకు కింగ్ ఖాలిద్ ఫౌండేషన్, సలేహ్ కామెల్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్, అల్-ముహైదిబ్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనిటీ సర్వీస్ సంయుక్తంగా నిధులు సమకూర్చాయి.
ఎలక్ట్రానిక్ గేమింగ్ వాతావరణంలో పాల్గొనే పిల్లలు, వివిధ వయసుల వ్యక్తులతో సంభాషణలకు, అలాగే వారి అభివృద్ధి దశకు తగని భాష మరియు అంశాలకు గురవుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం డిజిటల్ ఫ్రెండ్స్ భావనను ఎక్కువగా అంగీకరిస్తున్నారని, అటువంటి వర్చువల్ సహచరులతో వారి సంభాషణకు మద్దతు కూడా ఇస్తున్నారని ఈ పరిశోధనలో వెల్లడైంది.
అదే సమయంలో, కొన్ని ప్రతికూల అనుభవాల కారణంగా కొంతమంది పిల్లలు ఈ రకమైన స్నేహం పట్ల ప్రతికూల అభిప్రాయాలను పెంచుకోగా, మరికొందరు సంభాషణలో సవాళ్లు మరియు అస్థిరతను పేర్కొంటూ డిజిటల్ స్నేహాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం
- యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యం: డీజీపీ సీవీ ఆనంద్







