కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య సంయుక్త దర్శకత్వంలో రజనీ..
- August 10, 2016
సూపర్స్టార్ రజనీకాంత్ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని తాజాగా వచ్చిన 'కబాలి' చాటిచెప్పింది. ఫలితంతో ఏ మాత్రం సంబంధం లేకుండా రజనీ ఎలా కలెక్షన్ల వర్షం కురిపిస్తారోనన్న విషయం కూడా స్పష్టమైంది. 'కబాలి' అనంతరం శంకర్ దర్శకత్వంలో ఆయన '2.ఓ'లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీని చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తర్వాత తన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య సంయుక్త దర్శకత్వంలో రజనీ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య తన తండ్రికి సంబంధించి ఓ పుస్తకాన్ని రూపొందిస్తున్నారు. దీని ఆధారంగా సినిమా తీయాలని యోచిస్తున్నారు. మెగాప్రాజెక్టుగా దీన్ని చేపట్టనున్నట్లు కోలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరులో సినిమా ఆరంభమయ్యే అవకామున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్ హీరోగా సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్' అనే మోషన్ క్యాప్చర్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







