టీటీడీ కీలక నిర్ణయం..
- June 23, 2026
తిరుమల: టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్.. తెలుగు రాష్ట్రాల్లోని ఆధ్యాత్మిక వైభవానికి పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఆరు ప్రముఖ దేవాలయాల పునర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధికి భారీగా నిధులను మంజూరు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ ఆలయాల పురోభివృద్ధికి కోట్లాది రూపాయలను కేటాయించి భక్తులకు మరిన్ని మెరుగైన వసతులు కల్పించేందుకు సిద్ధమైంది.
తెలంగాణ ప్రాంతంలోని ఆలయాల విషయానికి వస్తే.. సిద్దిపేట జిల్లా దొమ్మాటలోని శ్రీమహాకాళేశ్వర ఆలయానికి అత్యధికంగా రూ.4.60 కోట్ల భారీ నిధులను కేటాయించింది. ఈ నిధులతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. అలాగే సంగారెడ్డి జిల్లా కించన్పల్లిలోని శ్రీలక్ష్మి వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.09 కోట్లు, సికింద్రాబాద్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ ఆధునీకరణ కోసం రూ.50 లక్షలు మంజూరు చేశారు. వీటితో పాటు సిద్దయ్యగుట్ట ధర్మవరంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రూ.50.85 లక్షల నిధులు అందనున్నాయి.
ఈ కేటాయింపుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పటిష్టం కానుంది. ఇక ఆంధ్రప్రదేశ్ పరిధిలోని దేవాలయాలకు కూడా శ్రీవాణి ట్రస్ట్ పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసింది. అనకాపల్లి జిల్లా మునగపాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల నిమిత్తం రూ.1.75 కోట్లు కేటాయించగా, కర్నూలు జిల్లా హుస్సేనాపురంలోని శ్రీసుంకులమ్మ, మారెమ్మ ఆలయాల అభివృద్ధి పనుల కోసం రూ.1.10 కోట్ల మంజూరు చేశారు. శ్రీవాణి ట్రస్ట్ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- డా.ఈష్ సింఘాల్కు ఘన వీడ్కోలు.. కతార్లో భారతీయ సమాజానికి విశేష సేవలకు ప్రశంసలు
- కర్ణాటకలో గుట్కా, పాన్ మసాలా పై నిషేధం
- షార్జాలో మట్టితో నంబర్ ప్లేట్ దాచిన డ్రైవర్ అరెస్ట్..!!
- సౌదీలో భారీగా ఖాట్, హషీష్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..!!
- సలాలాలో ఫుడ్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- కొవ్వొత్తి మంటతో రూమ్మేట్ మృతి.. మహిళకు ఏడాది జైలు..!!
- నాన్-హైడ్రోకార్బన్ రంగాల వృద్ధి..ఖతార్ ఆర్థిక వ్యవస్థకు బలం..!!
- శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులకు గుడ్న్యూస్..
- సింక్ఫీల్డ్ కప్లో ఆర్ ప్రజ్ఞానంద సంచలన విజయం
- చంద్రశేఖరన్ రిజైన్.. టాటా గ్రూప్ షేర్లు పతనం







