యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- June 26, 2026
మనామా: జీసీసీ-యూఎస్ సంయుక్త మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో భేటీ బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ అయ్యారు. ఈ సమావేశంలో, బహ్రెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ మధ్య ఉన్న దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలను సమీక్షించారు. పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించే అవకాశాలపై చర్చించారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలు మరియు సమగ్ర భద్రతా ఒప్పందం (C-SIPA)తో సహా ఇప్పటికే ఉన్న ఒప్పందాల కింద సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై దృష్టి సారించారు.
ఇటీవలి ప్రాంతీయ పరిణామాలు మరియు మధ్యప్రాచ్యం అంతటా శాంతి మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో చేస్తున్న ప్రయత్నాలపై కూడా చర్చించారు. అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం, పరిష్కారం కాని సమస్యలకు సమగ్ర పరిష్కారం కోసం జరుగుతున్న దౌత్యపరమైన చొరవలపై ఇరుపక్షాలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. అలాగే, ఈ సమావేశంలో పరస్పర ఆందోళన కలిగించే పలు ప్రాంతీయ అంశాలు, ప్రాంతీయ భద్రత మరియు స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి కూడా చర్చించారు.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







