బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- June 26, 2026
రియాద్: సౌదీ అరేబియాకు ప్రయాణించే బ్రిటిష్ పౌరుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) సేవను ప్రారంభించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది జూలై 1, 2026 నుండి అమలులోకి వస్తుంది. సౌదీ అరేబియా మరియు యునైటెడ్ కింగ్డమ్ మధ్య ఉన్న చారిత్రక మరియు విశిష్ట సంబంధాలకు కొనసాగింపుగా, సౌదీ పౌరుల కోసం బ్రిటిష్ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన ప్రయాణ సౌకర్య చర్యలపై ఈ సర్వీస్ ఆధారపడి ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ETA, సౌదీకి ప్రయాణించే అన్ని రకాల బ్రిటిష్ పాస్పోర్ట్లు కలిగిన వారికి అందుబాటులో ఉంటుంది. పర్యాటకం, స్వల్పకాలిక చదువు మరియు వ్యాపార ప్రయోజనాల కోసం చేసే ప్రయాణాలకు వర్తిస్తుంది. ఈ ఆథరైజేషన్ ప్రయాణికులను ఒక సంవత్సరంలోపు వరుసగా 180 రోజుల వరకు సౌదీ అరేబియాలో ఉండటానికి అనుమతిస్తుంది. ఒకే ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ కింద మల్టీపుల్ ఎంట్రీలను అనుమతిస్తుంది. అయితే, ఇది ఉపాధి లేదా నివాసానికి వర్తించదని, అలాగే హజ్ వీసాలకు కూడా వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!
- BITS పిలానీ గోవా క్యాంపస్లో ఘనంగా 2026 స్నాతకోత్సవం..
- UAE అధ్యక్షుడు, బహ్రెయిన్ రాజు మధ్య భేటీ..







