తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- June 26, 2026
తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీపి కబురు అందించింది. వీరికి ప్రత్యేక కోటా కింద ప్రతిరోజూ 1,000 మందికి ఉచిత దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. స్వామివారి దర్శనంతో పాటు ఈ టికెట్ పొందిన భక్తులకు ఉచితంగా ఒక లడ్డూను (రూ.50 విలువైనది) కూడా బహుమతిగా అందించనున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
3 నెలల ముందే ఆన్లైన్ బుకింగ్.. మధ్యాహ్నం 3 గంటలకే ఎంట్రీ!
60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల కోటాకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ ప్రతి నెలా ఆన్లైన్లో విడుదల చేస్తోంది. భక్తులు మూడు నెలల ముందే ఈ ఉచిత దర్శన టికెట్లను అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ టికెట్లు పొందిన భక్తులను తిరుమలలోని నంబి ఆలయం వద్ద ఉన్న ప్రత్యేక క్యూలైన్ ద్వారా మధ్యాహ్నం 3:00 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
దళారులను నమ్మొద్దు.. మోసపోతే ఈ నెంబర్కు కాల్ చేయండి!
ఇటీవలి కాలంలో తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అమాయక భక్తులను నమ్మించి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారి పట్ల భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది.
ఫిర్యాదుల కోసం హెల్ప్లైన్ నెంబర్: ఎవరైనా దళారులు దర్శన టికెట్ల పేరుతో మిమ్మల్ని సంప్రదిస్తే వెంటనే టీటీడీ అధికారిక హెల్ప్లైన్ నెంబర్ 155257 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరారు. భక్తులను మోసం చేసే మధ్యవర్తులు, దళారులపై ప్రత్యేక నిఘా ఉంచామని, అలాంటి వారు పట్టుబడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ స్పష్టం చేసింది.
సోషల్ మీడియా వదంతులు నమ్మకండి!
సీనియర్ సిటిజన్ల దర్శనానికి సంబంధించి గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో (Social Media) రకరకాల తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, వాటన్నింటినీ భక్తులు పూర్తిగా తిరస్కరించాలని టీటీడీ సూచించింది. తిరుమల దర్శనాలు, సేవల గురించిన సరైన సమాచారం మరియు బుకింగ్స్ కోసం కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది. టీటీడీ అధికారిక వెబ్సైట్లుhttp://https://ttdevastanams.ap.in.
తాజా వార్తలు
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..







