చైనాలో స్టీమ్ పైప్ పేలి 21 మంది మృతి
- August 11, 2016
చైనాలో భారీ పేలుడు కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ చైనాలోని హుబై ప్రావిన్స్లో ఒత్తిడి ఎక్కువై స్టీమ్ పైపు పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రావిన్స్లోని దన్యాంగ్ నగరంలోని పవర్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో 21 మంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల కాలంలో చైనాలో పరిశ్రమల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. గత ఏడాది తియాంజిన్ నగరంలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించి 173 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









