చైనాలో స్టీమ్ పైప్ పేలి 21 మంది మృతి
- August 11, 2016
చైనాలో భారీ పేలుడు కారణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. సెంట్రల్ చైనాలోని హుబై ప్రావిన్స్లో ఒత్తిడి ఎక్కువై స్టీమ్ పైపు పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రావిన్స్లోని దన్యాంగ్ నగరంలోని పవర్ స్టేషన్ సమీపంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఘటనలో 21 మంది మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడికి దారితీసిన కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల కాలంలో చైనాలో పరిశ్రమల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. గత ఏడాది తియాంజిన్ నగరంలోని రసాయన కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించి 173 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







