యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- June 29, 2026
అబుదాబి: యూఏఈలోని భారతీయులకు కీలక ప్రకటన వెలువడింది. సాధారణ పాస్పోర్ట్, వీసా, అట్టెస్టేషన్ సేవల నిలిపివేతను జూలై 1, 2026 వరకు పొడిగించినట్లు అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం, దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ సోమవారం ప్రకటించాయి.
భారత రాయబార కార్యాలయం అధికారిక ఎక్స్ (X) ఖాతాలో విడుదల చేసిన ప్రకటన ప్రకారం, జూలై 1 వరకు అత్యవసర (ఎమర్జెన్సీ) పాస్పోర్ట్, వీసా, ఇతర కాన్సులర్ సేవలు, అట్టెస్టేషన్ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఇంతకుముందు జూన్ 19న భారత రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, జూలై 1 నుంచి యూఏఈ అంతటా పాస్పోర్ట్, వీసా, అట్టెస్టేషన్ సేవలను ఔట్సోర్సింగ్ సంస్థగా ‘అల్హింద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎల్ఎల్సీ’ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మార్పు నేపథ్యంలో సాధారణ సేవలను జూన్ 26 నుంచి జూన్ 30 వరకు ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం పాస్పోర్ట్, వీసా సేవలను నిర్వహిస్తున్న బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ (BLS International), అట్టెస్టేషన్ సేవలను అందిస్తున్న ఎస్జీఐవీఎస్ గ్లోబల్ (SGIVS Global) సంస్థలు జూన్ 25తో కొత్త దరఖాస్తుల స్వీకరణను నిలిపివేశాయి.
తాజాగా పరిపాలనా కారణాల వల్ల సాధారణ సేవల నిలిపివేతను మరో రోజు కొనసాగించాలని భారత మిషన్లు నిర్ణయించాయి.
ఈ సమయంలో అత్యవసర సహాయం అవసరమైన వారు టోల్ఫ్రీ నంబర్ 800 46342 (800 INDIA), వాట్సాప్: +971 54 309 0571, లేదా [email protected] ఇమెయిల్ ద్వారా భారత మిషన్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
జూలై 2 నుంచి సేవలు ఎలా అందుబాటులో ఉంటాయన్న వివరాలను త్వరలో ప్రకటిస్తామని రాయబార కార్యాలయం తెలిపింది. తాజా సమాచారం కోసం భారత రాయబార కార్యాలయం, దుబాయ్ కాన్సులేట్ అధికారిక సోషల్ మీడియా వేదికలను అనుసరించాలని భారతీయులకు విజ్ఞప్తి చేసింది.
🔔 Important update regarding the Consular Services in the UAE pic.twitter.com/Wnlnu8sl0f
— India in UAE (@IndembAbuDhabi) June 29, 2026
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం







