ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- July 05, 2026
మస్కట్: ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ గడువు ముగిసేలోపే వివాహ ఒప్పందాలను నమోదు చేసుకోవాలని ఒమన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH) కోరింది. నిబంధనలు పాటించకపోతే చట్టపరంగా జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రీ మారిటల్ వైద్య పరీక్షలను నియంత్రించే రాయల్ డిక్రీ లోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
ఈ డిక్రీలోని ఆర్టికల్ 4 ప్రకారం, వధూవరులిద్దరూ చెల్లుబాటు అయ్యే వివాహ పూర్వ వైద్య పరీక్ష ధృవీకరణ పత్రాన్ని సమర్పించకపోతే, వివాహాన్ని జరిపించడం లేదా నమోదు చేయడాన్ని నిషేధించింది. ఆర్టికల్ 5 ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షలను నిర్దేశిస్తుంది. దీని ప్రకారం 10 రోజుల కంటే తక్కువ కాకుండా మరియు ఆరు నెలలకు మించకుండా జైలు శిక్ష, 100 నుండి 1,000 ఒమానీ రియాల్స్ (OMR) వరకు జరిమానా లేదా ఈ రెండూ విధించబడవచ్చు. వివాహ ప్రక్రియలు చట్టానికి అనుగుణంగా పూర్తయ్యేలా చూసేందుకు సంబంధిత వ్యక్తులందరూ నిబంధనలను పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోరింది.
2025లో జారీ చేయబడిన వివాహ ధృవీకరణ పత్రాల సంఖ్యలో భారీ పెరుగుదల నమోదైన నేపథ్యంలో ఈ హెచ్చరికను జారీ చేసినట్టు మంత్రిత్వశాఖ తెలిపింది.తాజా అధికారిక గణాంకాల ప్రకారం, సుల్తానాట్ (ఒమన్) అంతటా ఉన్న నోటరీ పబ్లిక్ విభాగాలు 2025లో 23,117 వివాహ ధృవీకరణ పత్రాలను జారీ చేశాయి. ఇది 2024లో 17,896 మరియు 2023లో 14,716గా ఉంది. అంటే గత మూడేళ్లుగా ఇందులో పెరుగుదల నమోదైంది. అదే సమయంలో విడాకుల ధృవీకరణ పత్రాల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 3,828 మరియు 2024లో 4,122గా ఉన్న ఈ సంఖ్య 2025 నాటికి 4,208కి చేరింది.
మస్కట్ గవర్నరేట్ అత్యధిక సంఖ్యలో వివాహాలను నమోదు చేసింది. ఇక్కడ 2025లో 6,651 వివాహ ధృవీకరణ పత్రాలు మరియు 1,220 విడాకుల ధృవీకరణ పత్రాలు జారీ అయ్యాయి. 3,753 వివాహాలతో నార్త్ అల్ బాతినా రెండో స్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో 2,683 వివాహాలతో సౌత్ అల్ బాతినా, 2,462తో ధోఫర్ మరియు 2,425తో అల్ దఖిలియా ఉన్నాయి.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







