తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- July 04, 2026తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక సమాచారమిచ్చింది. రానున్న జులై 14, జులై 17 తేదీల్లో ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు ఉన్నందున, ఆయా రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సాధారణ భక్తులకు కల్పించే దర్శన సమయాన్ని పెంచేందుకు వీలుగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ దర్శనాల రద్దుకు గల కారణాలను తితిదే తన ప్రకటనలో స్పష్టం చేసింది. జులై 14వ తేదీన ఆలయ శుద్ధీకరణ కార్యక్రమమైన ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’, అలాగే జులై 17వ తేదీన శ్రీవారి ఆలయంలో అత్యంత వైభవంగా జరిగే ‘ఆణివార ఆస్థానం’ కొలువును పురస్కరించుకుని బ్రేక్ దర్శనాలకు స్వస్తి పలికారు. ఇందులో భాగంగానే జులై 13, 16 తేదీల్లో వీఐపీ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరించబోమని బోర్డు తేల్చిచెప్పింది.
కేవలం బ్రేక్ దర్శనాలే కాకుండా, జులై 17న శ్రీవారి ఆలయంలో నిర్వహించే పలు ఆర్జిత సేవలను కూడా తితిదే రద్దు చేసింది. ఆ రోజున స్వామివారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు జరగవని వెల్లడించింది. భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ తిరుమల ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని తితిదే అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







